నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

249
cmkcr
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు ప్రగతి భవన్ లో పార్లెమెంటరీ పార్టీ సమావేశం జరుగునుంది. ప్రగతి భవన్ మధ్యాహ్నం 2గంటలకు ఈసమావేశం ప్రారంభంకానుంది. ఇక ఈనెల 17నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా పార్లమెంట్ లో అనుసరించాల్సి న వ్వూహాలపై ఎంపీలతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ లోక్‌సభాపక్ష నేతపైనా నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, విడుదల కావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాల అమలులో కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే దానిపై చర్చించనున్నారు. సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు సమాచారం అందింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి 9 మంది గెలువగా.. ఆరుగురు రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 15 మంది ఎంపీలు సమావేశానికి హాజరుకానున్నారు.

- Advertisement -