నేటితో ముగియనున్న హుజుర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం

440
Rajath Kumar
- Advertisement -

సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5గంటలలోపు అన్నీ పార్టీలు ప్రచారం ముగించాలని తెలిపారు ఎన్నికల అధికారులు. ఇవ్వాళ సాయంత్రం 5 గంటల నుండి టివి లలో హుజర్ నగర్ ఎన్నికల ప్రచారం దృశ్యాలను చూపించవద్దు అంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు హుజూర్ నగర్ నియోజక వర్గంలో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు వెళ్లిపోవాలని చెప్పారు.

హుజుర్ నగర్ నియోజకవర్గంలోని లాడ్జ్,ఫంక్షన్ హాల్ లలో ఇతర జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, నేతలు ,నాయకులు ఉంటే సాయంత్రం 5 గంటల లోపు పంపించేయలని జిల్లా ఎన్నికల యంత్రాంగం కు సీఈఓ రజత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈనెల 21న హుజుర్ నగర్ లో ఉప ఎన్నిక జరుగనుండగా.. 24న ఫలితాలు వెలువడనున్నాయి.

huzur 1

- Advertisement -