నేడు ప్రాజెక్టులు ప‌రిశీలించిననున్న సీఎం కేసీఆర్..

224
kcr
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప‌రిశీల‌న‌లో భాగంగా సీఎం కేసీఆర్ నేడు పెద్దప‌ల్లి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. మధ్యాహ్నం 12:05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలీకాఫ్టర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకోనున్నారు. 1:50 గంటల వరకు బ్యారేజీ పనులు పరిశీలించి, 2గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం భోజనం తర్వాత 3గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి 3:15గంటలకు అన్నారం బ్యారేజీ చేరుకుంటారు.

అన్నారం బ్యారేజీ పనులు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 3:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీకి 3:45 గంటలకు చేరుకుంటారు. సుందిళ్ల బ్యారేజీ పనులు పరిశీలించి అక్కడి నుంచి అంతర్గాం మండలంలోని గోలివాడ పంప్‌హౌస్‌కు 4:15 గంటలకు చేరుకొని పనులు పరిశీలిస్తారు. 4.45గంటలకు గోలివాడ నుంచి బయలుదేరి సాయంత్రం గంటలకు కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలోని తన నివాసానికి చేరుకొని రాత్రి బస చేస్తారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు గంట పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తారు.

- Advertisement -