టైమ్స్‌నౌ సర్వే ఫలితాలు: మళ్లీ కేసీఆరే సీఎం..

216
CM KCR
- Advertisement -

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో నేపథ్యంలో టైమ్స్‌నౌ ప్రీ పోల్స్ సర్వే నిర్వహించగా అందులో మళ్లీ కేసీఆర్‌ గెలుపు ఖాయమని ప్రజలు తీర్పునిచ్చారు. టీఆర్‌ఎస్ 70 సీట్లను గెలుచుకోనున్నట్టు టైమ్స్‌నౌ వెల్లడించింది. కాంగ్రెస్ 31 సీట్లను, టీడీపీ 2, ఎమ్‌ఐఎమ్ 8, బీజేపీ 3, ఇతరులు 5 సీట్లు గెలుచుకోనున్నట్లు సర్వే ప్రకటించింది.

CM KCR

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని 45.27 శాతం ప్రజలు కోరుకోగా… ఉత్తమ్ కుమార్ రెడ్డికి 30.55, కోదండరాంకు 3.37 శాతం మద్దతు లభించింది. ఇక.. టీఆర్‌ఎస్‌కు 37.55 శాతం ఓట్లు వస్తాయని.. కాంగ్రెస్‌కు 27.98 శాతం, టీడీపీకి 5.66, ఎమ్‌ఐఎమ్‌కు 4.10 శాతం, బీజేపీకి 11 శాతం, ఇతరులకు 13.71 శాతమని సర్వే ఫలితాలు తేల్చేశాయి.

- Advertisement -