గణేశ్ నిమజ్జనం.. 21వేల మందితో బందోబస్తుః సీపీ

399
anjanikumar
- Advertisement -

రేపు నగరంలో జరిగే గణేశ్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. 21 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపామని చెప్పారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీసు ఫోర్స్‌తో నిఘా ఏర్పాటు చేశామన్నారు.

నిరంతరం పోలీసు అధికారులు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. నగరంలో  ఇప్పటి వరకు 17 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. 35 గంటల పాటు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జీహెచ్‌ఎంసీ సమన్వయంతో సీపీ ఆఫీస్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాం. 11,198 విగ్రహాలకు జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేశాం. ప్రతీ పోలీసు స్టేషన్‌లో పర్యవేక్షణ బృందం ఉంటుంది.

మూడు లక్షలకు పైగా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్న సీపీ.. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు 261 సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. ఖైరతాబాద్‌ గణేష్‌ కోసం 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. నిమజ్జన ప్రక్రియలో భాగంగా ఏమైనా సమస్యలు వస్తే 9490616555 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు.

- Advertisement -