జనవరి 29న ప్రకాశ్‌ రాజ్‌ను చంపుతాం..!

424
prakash raj
- Advertisement -

నటుడు ప్రకాశ్ రాజ్ సహా 13 మందిని చంపుతామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న ప్రకాశ్ రాజ్, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నిజగుణానంద,సీపీఎం ప్రధాన కార్యదర్శి బృందా కారత్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని హతమారుస్తామని లేఖ విడుదల చేశారు.

లేఖలో బజరంగ్ దల్ నేత మహేంద్ర కుమార్, నిడుమామిడి వీరభద్ర చెన్నమళ్లస్వామి, , జ్ఞానప్రకాశ్ అసూరీ, నటుడు చేతన్ కుమార్, బీటీ లలిత్ నాయక్, మైసూర్‌కు చెందిన ప్రొఫెసర్లు మహేశ్‌చంద్ర గురు, భగవాన్, దినేశ్ అమైన్ మట్టు, చంద్రశేఖర్ పాటిల్, దుండి గణేశ్, రౌడి అగ్ని శ్రీధర్ పేర్లు ఉన్నాయి.

ఆర్ఎస్‌ఎస్‌పై విమర్శలు గుప్పిస్తోన్న నిజగుణానందస్వామి మఠం బెళగావికి ఈ లేఖ వచ్చింది. కన్నడలో రాసిన ఈ లేఖలో ధర్మ ద్రోహులు, దేశద్రోహులను జనవరి 29న అంతంచేయడానికి ముహూర్తం నిర్ణయించాం.. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అని పేర్కొన్నారు. ఈ లేఖను ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్‌ ఖాతాలో ఉంచాగా దీనిపై బెళగావి ఎస్పీకి ఫిర్యాదుచేశారు నిజగుణానంద శిష్యులు.

prakash raj

- Advertisement -