గావస్కర్‌ భారత ప్ర‌పంచ‌క‌ప్‌ జట్టులో వీరికే చోటు..

330
- Advertisement -

భారత జట్టు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ త్వరలో ఆరంభంకానున్న ఐసీసీ ప్రపంచకప్-2019 టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ మరో మూడు నెలల్లో జరుగనుంది. దీని సంబంధించిన భారత జట్టు ఎంపిక ఎలా జరుగుతుంది, జట్టులో ఎవరెవరు ఉంటారు అనే విషయంపై ఇప‍్పటికే క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ద్వైపాక్షికి సిరీస్‌ ఆడనుంది.

Sunil Gavaskar

అయితే దీనిలో భాగంగా భారత జట్టు ప‍్రకటించిన జాబితాలో దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం దక‍్కలేదు. దాంతో వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే భారత జట్టులో కార్తీక్‌కు చోటు కష్టమనే వాదన వినిపిస్తోంది. ఈ తరణుంలో ఇదే తన భారత వరల్డ్‌కప్ జట్టు అంటూ దిగ్గజ ఆటగాడు గావస్కర్‌ ప్రకటించాడు. అందులో దినేశ్‌ కార్తీక్‌కు ఓపెనర్‌గా అవకాశం కల్పించాడు. దినేశ్‌ కార్తీక్‌ను మూడో ఓపెనర్‌గా ఎంపిక చేసిన గావస్కర్‌.. కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, రహానేలకు మాత్రం తన జట్టులో చోటివ్వలేదు.

గావస్కర్ టీమ్ ఇదే.. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్‌కుమార్, యుజువేంద్ర చాహల్, బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.. మీడియం పేస్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ 14వ ఆటగాడు అయి ఉండొచ్చు. ఇంగ్లాండ్ స్వింగ్ పరిస్థితులను బట్టి భారత్ ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలో దిగాలి. ఐతే 15వ నంబర్ ఆటగాడు ఎవరనే దానిపై కచ్చితంగా చెప్పలేను. ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌లకు మాత్రం అందుకు అవకాశమే లేదు. సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ టీమిండియాకు ఉన్న మరో ఆప్షన్ గావస్కర్ పేర్కొన్నారు.

- Advertisement -