ప్ర‌భుత్వానికి రూ.కోటీ 75 ల‌క్ష‌లు అంద‌జేత‌..

263
Singireddy Niranjan Reddy Minister
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 2017-2018 సంవ‌త్స‌రాల‌కు గాను రూ.26.74 కోట్ల లాభం గిడ్డంగుల సంస్థ అర్జించింది. అందులో డివిడెండ్ కింద రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ‌చ్చే రూ.కోటీ 75 ల‌క్ష‌ల చెక్కును రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర‌ గిడ్డంగుల సంస్థ చైర్మ‌న్ మందుల సామేల్ అంద‌జేశారు. రూ.26.74 కోట్ల లాభాల‌లో రూ.3.5 కోట్లు డివిడెండ్‌గా ప్ర‌క‌టించారు. దానిలో 50 శాతం రాష్ట్ర ప్ర‌భుత్వానికి, 50 శాతం కేంద్ర గిడ్డంగుల సంస్థకు అందించ‌డం ఆన‌వాయితీ.

ఈ మేర‌కు చెక్కును స‌చివాల‌యంలోని మంత్రి ఛాంబ‌ర్‌లో అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సంస్థ ఎండీ భాస్క‌రాచారి, కార్య‌ద‌ర్శి బ‌జార్, సుధాక‌ర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సుధారాణి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంధ‌ర్భంగా త‌మ సంస్థ‌కు అత్య‌వ‌స‌రంగా 50 మంది ఉద్యోగుల‌ను నియ‌మించాల‌ని, ఉద్యోగుల కొర‌త‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని మందుల సామేల్ మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌గా సానుకూలంగా స్పందించారు.

- Advertisement -