తెలంగాణలో క్రీడారంగానికి ప్రాధాన్యత..

517
sports
- Advertisement -

తెలంగాణ వచ్చిన తర్వాత క్రీడా రంగానికి ప్రాధాన్యత పెరిగిందని తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అన్నారు. వరంగల్‌లో 39వ సబ్ జూనియర్ బాయ్స్ మరియు గర్ల్స్ ఇంటర్ డిస్టిక్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ 2019కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గ్రామీణ నేపథ్యం ఉన్న ఎందరో క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించడం ఒక శుభపరిణామం అని అన్నారు.

క్రీడలను మరియు క్రీడాకారులను ప్రోత్సహించడంలో తాను ఎప్పుడు ముందుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాష్ రావు, డిసిపి ఈస్ట్ జోన్ నాగరాజు , కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తో పాటు పలువురు హాజరయ్యారు.

- Advertisement -