ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: స్పీకర్

387
Telangana Speaker
- Advertisement -

ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లిం సోదర,సోదరీమణులకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి శ్రద్దలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవలన్నారు.

సేవాదృక్పధం, భక్తి ప్రవృతులు,సోదరభావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లిం సోదరులు సంతోషం గా జరుపుకోవాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్రం రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. కరోనా నేపధ్యంలో రంజాన్ పండుగను ఎవరి ఇంట్లో వారే కుటుంబ సభ్యులతో కలిసి వేడుకగా జరుపుకుని యావత్ ప్రపంచ ప్రజలు అందరం బాగుండాలి అని ప్రార్ధించాలని కోరారు.

- Advertisement -