19న కొత్త మున్సిపల్ చట్టం ఆమోదం..!

411
cm kcr
- Advertisement -

తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను జులై 18, 19 తేదీల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు 18న అసెంబ్లీ 19న మండలి సమావేశం కానున్నది. జులై 18న బిల్లు ప్రతులను శాసన సభ్యులకు అందచేసి దాని మీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19న చర్చించి చట్టంగా ఆమోదం పొందుతుంది.

రెండు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించిందని, ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ సందర్భంగా ఉండవు. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపినట్లు సిఎం తెలిపారు.

- Advertisement -