తెలంగాణలో నూతనంగా ఎన్నికైన 8మంది ఎమ్మెల్సీలు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11గంటలకు మండలి ఇంఛార్జ్ నేతి విద్యాసాగర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
శాసనసభ్యుల కోటా కింద మంత్రి మహమూద్అలీ, శేరి సుభాష్రెడ్డి, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశంలు తెరాస తరఫున; మీర్జా రియాజ్ హసన్ మజ్లిస్ నుంచి గెలిచారు.
అలాగే నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎ.నర్సిరెడ్డి; కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి; కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్ర నియోజకవర్గం నుంచి జీవన్రెడ్డి గెలిచారు. వీరిలో ఏడుగురు ప్రమాణస్వీకారానికి అంగీకారం తెలిపారు. జీవన్రెడ్డి మరోరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారానికి శాసనమండలి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.