- Advertisement -
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 120మున్సిపాలిటీలు, 9కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా బీ పారాలు ఇచ్చేందుక అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం.నామినేషన్ వేసిన అభ్యర్దులు ఈనెల14న మధ్యాహ్నం 3గంటల్లోగా బీ ఫారాలు ఇవ్వచ్చని తెలిపింది.
ఈనెల 14వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. ఈనెల 22న పోలింగ్ జరగగా, 25న ఫలితాలు వెలువడనున్నాయి.ఒక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మాత్రం 12 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
- Advertisement -