మొక్కలు నాటిన రాష్ట్ర గ్రంధాలయ సంస్ధ చైర్మన్

345
green challeange
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నేడు మొక్కలు నాటారు తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్ధ చైర్మన్ ఆయచితం శ్రీధర్. తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంతో ఇప్పటికే నాలుగు కోట్ల వరకు మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -