ఫేక్ న్యూస్‌ ఏదో తెలుసుకోవడానికి కొత్త వెబ్ సైట్..

430
- Advertisement -

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విళయతాండవం చేస్తోంది. క్షణక్షణానికి రోగుల సంఖ్య పెరిగిపోతున్నారు. అలాగే, మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. అయితే ఈ నేపథ్యంలో కరోనాపై సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. డిజిటల్ మీడియాలో సర్క్యలేట్ అయ్యే వార్తలు, కథనాలపై నిజ నిర్దారణ కోసం, ఫేక్ వార్తల కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త వెబ్ సైట్ ను ప్రవేశపెట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో, భారత దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి? అందులో ఎంతమంది చనిపోయారనే అధికారిక సమాచారాన్ని మీరు ఈ లింక్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం రకరకాల ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓసారి అలాంటి వార్తలను ఇతరులకు ఫార్వార్డ్ చేసే ముందు ఇక్కడ చెక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. https://factcheck.telangana.gov.in/

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మీద అధికారిక సమాచారం కోసం http://hmfw.ap.gov.in/covid_dashboard.aspx చెక్ చేయండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం అందజేస్తుంది. ఇవి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం.

అయితే, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన కరోనా సమాచారం https://www.mohfw.gov.in/ లో తెలుసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఏదేశంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయనే వివరాలను https://www.worldometers.info/coronavirus/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీన్ని నిర్వహిస్తోంది.

- Advertisement -