రాష్ట్ర తొలి మహిళా మంత్రిగా సబితా

321
sabitha
- Advertisement -

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పూర్తైంది. అందరూ అనుకున్నట్లుగానే కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి లకు మంత్రి పదవులు లభించాయి. కొత్తగా ఆరుగురు మంత్రులతో నేడు ప్రమాణం చేయించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఈసందర్భంగా మొదట హరీష్‌ రావు ప్రమాణం చేయగా ఆ తర్వాత కేటీఆర్, సబితా, గంగుల కమలాకర్, సత్యవతి, పువ్వాడ అజయ్ లు చేశారు.

ఇక తొలి తెలంగాణ మహిళా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి… ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. సబిత ఇంద్రారెడ్డితో పాటు ఇటివలే ఎమ్మెల్సీగా ఎన్నికైన సత్యవతి రాథోడ్ కు కుడా మంత్రి వర్గంలో స్ధానం కల్పించారు సీఎం కేసీఆర్.

- Advertisement -