కేంద్ర ఆర్ధికసంఘం అధ్యక్షుడితో రాష్ట్ర ఆర్ధిక సంఘం సభ్యులు భేటీ

402
rajesham
- Advertisement -

ఢిల్లీలోని జవహర్ వ్యాపార భవనంలో కేంద్ర ఆర్థిక సంఘ అధ్యక్షులు ఎన్ కె సింగ్ తో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు జి. రాజేశం గౌడ్ , సభ్యులు ఎం. చెన్నయ్య సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్ధిక సంఘం సూచనలతో ఒక లేఖను అందజేశారు. జిల్లా మరియు మండల స్థాయి పంచాయితీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధుల విడుదల యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్బంగా జరిగిన చర్చలతో రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించవలసిన అవసరం గురించి మరియు రాష్ట్ర ఆర్థిక సంఘల బలోపేతమునకు అవసరమగు సూచనలు ప్రస్తావనకు వచ్చాయి.

రాబోవు 15వ ఆర్థిక సంఘ సిఫారసులో అన్ని స్థాయి సంస్థలకు అవసరమైన నిధుల విడుదలకు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పతాక స్థాయి కార్యక్రమాలు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకములను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అతిధి మర్యాదలకు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -