అవన్నీ అబద్దాలు.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను..

500
kcr
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఏకధాటిగా ఆయన దాదాపు 3 గంటల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. తన ఆరోగ్యంపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇక కేసీఆర్ దిగిపోయి కుమారుడు కేటీఆర్‌ను కుర్చీలో కూర్చోబెడతారని ఊహాగానాలు వస్తున్నాయి.

ఇవన్నీ అబద్దం. నాకేమీ కాలేదు. ఆరోగ్యంగానే ఉన్నాను. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంకా మూడు సార్లు అధికారంలోకి వస్తుంది. నాకిప్పుడు 66 ఏళ్లు వచ్చాయి. కనీసం ఇంకో పదేైళ్లెనా పని చేయగలుగుతా. ఎవరెన్ని శాపాలు పెట్టినా నాకు అవి దీవెనలుగా పనిచేస్తాయి. ఇంకా రెండు పర్యాయాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని తెలిపారు..

- Advertisement -