నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ

348
Cabinet Meeting
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సాయంత్రం 4గంటలకు క్యాబినెట్ మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.కొత్త సచివాలయం నిర్మాణంపై సమావేశంలో చర్చించి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. నూతన రెవెన్యూచట్టంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే పలు దఫాలు సమావేశమై సూచనలు సలహాలు తీసుకున్నారు.

ఇక మరోపక్క తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సై అంటున్న తరుణంలో ప్రభుత్వం ఈ అంశంపై కీలకమైన నిర్ణయం తీసుకుంటుందా ? అనేది ఉత్కంఠగా మారింది. తమ డిమాండ్ల నెరవేర్చకపోతే ఈ నెల 5 నుంచి సమ్మె చేస్తామని తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ఇక కొత్త సచివాలయం నిర్మాణం పాత సచివాలయం కూల్చివేత అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఇప్పటికే సచివాలయం తరలింపు పూర్తవడంతో భవనాల కూల్చివేతపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -