అరుణ్ జైట్లీ మృతి..టీంఇండియా కీలక నిర్ణయం

431
indian-team
- Advertisement -

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయితే అయన మరణం పట్ల భారత క్రికెట్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. అరుణ్ జైట్లీ మృతికి సంతాపంగా వెస్టిండీస్‌తో ఈరోజు ఆడే మ్యాచ్‌లో టీం ఇండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగనున్నారు.

అరుణ్ జైట్లీ గతంలో ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌ (డీడీసీఏ)కు అధ్యక్షత వహించారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన తన సేవలందించారు. అరుణ్ ‌జైట్లీ సేవలను గుర్తు చేసుకుంటూ నేడు వెస్టీండీస్‌తో జరిగే మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బన్లు ధరించాలని టీం ఇండియా నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి ఈ ఆలోచనను ప్రతిపాదించగా, దానికి వెంటనే కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్, సీఈఓ రాహుల్ జోహ్రీ మద్దతు ఇచ్చారని సమాచారం.

- Advertisement -