నేను అదే ఇంట్లో ఉంటా.. సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

454
chandra-babu-naidu
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తన నివాసంలో ఉన్న ప్రజా వేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని ఆయన జగన్‌ను కోరారు. ఇప్పుడుతున్న నివాసంలోనే తాను కొనసాగాలనుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని యాజమాన్యం షరతుల మేరకు వినియోగించుకుంటానని చంద్రబాబు తెలిపారు.

 

తన నివాసంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సందర్శకులను కలుసుకొనేందుకు వీలుగా ప్రజా వేదికను ఉపయోగించుకొంటానని లేఖలో రాశారు. ప్రజావేదికను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. ఈవిషయంపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. 2014ఎన్నికల తర్వాత ఎపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణానది సమీపంలోని ఉండవల్లిలో ఆయన నివాసం ఉంటున్నారు.

- Advertisement -