రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం: తలసాని

407
Talasani
- Advertisement -

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకంటే తెలంగాణలో మెరుగైన వైద్యం అందుతోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గాంధీ అస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఈటెల రాజేందర్ లు పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల గాంధీ ఆస్పత్రిలో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ఆస్పత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

etelatalasani

ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. వాతావరణంలో మార్పుల కారణంగానే వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. వ్యాధుల బారిన పడినవారికి మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం, వైద్యులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు పబ్లిసిటీ కోసం తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దని ..మీడియా కూడా వాస్తవాలను చూపించాలని కోరారు.

- Advertisement -