కమిట్‌మెంట్ ఇస్తేనే..బిగ్ హౌస్‌లోకి..శ్వేతారెడ్డి సంచలనం!

591
swetha reddy big boss
- Advertisement -

తెలుగులో పాపులారిటీ సాధించిన రియాల్టీ షో బిగ్ బాస్. రెండు సీజన్‌లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్‌ బాస్ …తాజాగా మూడో సీజన్‌ కోసం సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభం కానుండగా ఇప్పటికే కంటెస్టెంట్‌ల ఎంపిక పూర్తైనట్లు సమాచారం. ఇక ఈ సారి బిగ్‌ బాస్‌ 3కు హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించనున్నారు.

ఈ నేపథ్యంలో అందరి కళ్లు బిగ్ బాస్‌పై ఉండగానే తెలుగు యాంకర్ శ్వేతా రెడ్డి ఈ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ షోలో పాల్గొనాలంటే మాకేం ఇస్తార‌ని స్టార్ మా కో ఆర్డినేట‌ర్ ఒక‌రు త‌నను క‌మిట్మెంట్ అడిగార‌ని ఆరోపించింది. బిగ్‌ బాస్‌కు ఎంపికైనట్లు తనకు ఫోన్ వచ్చిందని దీంతో అంతా సిద్ధం చేసుకోని బిగ్ బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తనకు ఓ బిగ్ బాస్ కో ఆర్డినేటర్ ఫోన్ చేసి కమిట్ మెంట్ అడిగారని మండిపడింది.

ఈ సారి బిగ్ బాస్‌లో కాస్త హాట్ నెస్ పెంచ‌డానికి అమ్మాయిల‌నే ఎక్కువ‌గా ఎంచుకుంటున్నారు. శ్రీ‌ముఖితో పాటు యాంక‌ర్ సావిత్రి, ఉద‌య‌భాను, హెబ్బా ప‌టేల్ లాంటి వాళ్లు ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌కు వ‌స్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్వేతా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

- Advertisement -