కొత్త బంగారు లోకం..పెళ్లైన ఏడాదికే విడాకులు

509
swetha basu prasad
- Advertisement -

కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమా తర్వాత పలు వివాదాల్లో కూరుకుపోయిన శ్వేతా తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌ని ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌తో ప్రారంభించింది. సరిగ్గా ఏడాది క్రితం పుణెలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

అప్పటినుంచి వార్తల్లో కనిపించని శ్వేతా తాజాగా తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. రోహిత్‌తో తన వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. రోహిత్‌తో తాను గడిపిన క్షణాలు మరవలేనివని ఇక నుంచి ఎవరి దారిలో వారు ప్రయాణించాలని డిసైడ్ అయ్యామని తెలిపింది.

swetha

రీసెంట్‌గా మంచు మనోజ్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలుకగా దియా మీర్జా, కే.రాఘవేంద్రరావు కొడుకు కే.ప్రకాష్ కోవెలమూడి,కనికా థిల్లాన్ కూడా విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ లిస్టులో శ్వేత బసు చేరడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -