వస్తే 200 ఇవ్వాలి -పరిపూర్ణానందస్వామి

392
- Advertisement -

ఆధ్యత్మిక గురువు పరిపూర్ణానందస్వామి ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం పరిపూర్ణానందస్వామి చౌటుప్పల్ నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి పరిపూర్ణానంద ప్రజలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రూ.200 ఇస్తే చాలు జనాలు ఎగబడి మీటింగులకు వస్తారు, ఓట్లు వేస్తారని బీజేపీ స్టార్‌క్యాంపెయినర్ పరిపూర్ణానంద ప్రజలను కించపరిచేలా మాట్లాడారు.

Paripoornananda Swamy

ఆయన ఏమన్నారంటే.. వస్తే 200 ఇవ్వాలి.. లేకుంటే రారు.. డబ్బులు ఇక్కడివాళ్లు ఇవ్వరు.. మనమే ఇవ్వాలి.. 20 వేల ఓట్లు వస్తే చాలు.. 200 చొప్పున ఇస్తే 20 వేల ఓట్లు తప్పకుండా వస్తాయి అని అన్నారు. ఆయన ప్రచార వాహనంపై ఉండి పక్కనే ఉన్న అనుచరుడికి ఈ విషయాలు తెలియజేశారు.

పరిపూర్ణానందస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన సొంత చానల్ అయిన భారత్‌టుడేలోనే ప్రసారం కూడా అయ్యాయి. ప్రవచనాలు చెప్పే స్వామి ఓట్ల కోసం డబ్బులు పంచుతామని మనసులోని మాటను తన అనుచరుడి వద్ద వెళ్లగక్కారు. డబ్బులు ఇవ్వాలని, 20 వేల ఓట్లు వస్తే సరిపోతుందన్న ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక ఈ స్వామి వ్యవహారానికి సొంతపార్టీ నేతలకు తల నొప్పిగా తయారైంది.

- Advertisement -