ముగిసిన సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

391
bhasurilast
- Advertisement -

మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆమెకు కన్నీటి విడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికారిక లాంభనాలతో లోథి రోడ్డులోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. విద్యుత్తు శ్మ‌శాన‌వాటిక‌లో సుష్మా పార్ధీవ‌దేహానికి నిప్పుపెట్టారు. సుష్మా కూతురు బాన్సురి స్వ‌రాజ్ అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు.

మధ్యాహ్నం సుష్మా స్వరాజ్ పార్ధివదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం బీజేపీ ఆఫీసులో ఉంచారు. సుష్మా స్వరాజ్ అంత్యక్రియల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, బీజేపీ అగ్రనేత అద్వానీ, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -