టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

397
jagadeesh
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సూర్యపేటలో టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సూర్యపేటను సుందర నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు సూర్యపేట ప్రజలు నీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడ్డారని..కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్ల గోసను తీర్చారని గుర్తుచేశారు.

గోదావరి నీళ్లు సూర్యపేటకు వస్తాయని మనం కళ్లో కూడా అనుకోలేదనీ.. కానీ, సీఎం కేసీఆర్‌ ఇక్కడి రైతుల పరిస్థితి అర్థం చేసుకొని గోదారి నీళ్లతో మన చెరువులను నింపారన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే తెలంగాణ బాగుపడిందనీ, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి, దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. సూర్యపేటలో టీఆర్ఎస్ అభ్యర్దులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

- Advertisement -