రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలిః మహేశ్ బాబు

430
Mahesh-Babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఈమూవీ విజయం సాధించిన అనంతరం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ కు వెళ్లారు. కొద్ది రోజుల క్రితం మహేశ్ బాబు ఇండియాకు వచ్చారు. తాజాగా మహేశ్ బాబు ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్యూ ఇచ్చారు. ఈఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మీరు ఒకరోజు ముఖ్యమంత్రి అయితే మొదటగా చేసే పని ఏమిటి అని అడగ్గా…నాకు తెలియదు..రాజకీయాలపై నాకు పెద్దగా అవగాహన లేదు అని చెప్పిన వెంటనే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి అని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి మహేశ్ అలాంటి వ్యాఖ్యలు చేశాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మహర్షి చిత్రం ఘన విజయం సాధించింది.

- Advertisement -