11 తీర్మానాలు ఆమోదించిన స్టాండింగ్ క‌మిటీ..

306
- Advertisement -

న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న గురువారం స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌తో పాటు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు చెరుకు సంగీత‌, ప్ర‌శాంత్‌గౌడ్‌, స‌మీనా బేగం, మ‌హ్మ‌ద్ అబ్దుల్ రెహ‌మాన్‌, ఎం.డి మిస్‌-బా-ఉద్దీన్‌, మ‌హ్మ‌ద్ అఖిల్ అహ్మ‌ద్‌, షేక్ హ‌మీద్‌, స‌బేహా బేగం, ఆర్‌. శిరీష‌లు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు హ‌రిచంద‌న‌, విశ్వ‌జిత్ కంపాటి, కెన‌డి, విజ‌య‌ల‌క్ష్మి, సిక్తాప‌ట్నాయ‌క్‌, శ్రీ‌నివాస్‌రెడ్డిలు, సురేష్‌, జియాఉద్దీన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో 11 ఎజెండా అంశాల‌ను ఆమోదించారు.

ghmc

స‌మావేశంలో ఆమోదించిన తీర్మానాలు ఇవే..

1- ప్ర‌తి డివిజ‌న్ కార్పొరేట‌ర్‌కు ప్లే, స్పోర్ట్స్ మెటిరీయ‌ల్‌కై ల‌క్ష రూపాయ‌లు వినియోగించుకునేందుకు ఆమోదం.
2- స‌రూర్‌న‌గ‌ర్ స‌ర్కిల్ 5 కొత్త‌పేట వార్డు నెంబ‌ర్ 21లో వివిధ కాల‌నీల్లో సిసిరోడ్ల నిర్మాణానికి రూ. 2.79 కోట్ల మంజూరుకు ఆమోదం.
3- ఇంటిగ్రేటెడ్ మున్సిప‌ల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ కింద జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో చేప‌ట్టే ప‌నుల‌కు జిఎస్‌టి, ఇత‌ర ప‌నుల నిమిత్తం రూ. 527.67 కోట్ల‌తో చేప‌ట్టే ప‌నుల‌కు ప్ర‌భుత్వ ఆమోదంకై ప్ర‌తిపాద‌న‌లు పంపుట‌కు ఆమోదం.
4- ప్ర‌స్తుతం న‌గ‌ర ప‌రిధిలో ఉన్న 221 ట్రాఫిక్ సిగ్న‌ళ్ల‌కు అద‌నంగా పోలీస్ క‌మిష‌న‌ర్లు రూ. 30.41 కోట్ల అంచ‌నాతో స‌మ‌ర్పించిన 155 చోట్ల కొత్త ట్రాఫిక్ సిగ్న‌ల్ ఏర్పాటుకు క‌మిటి ఆమోదం.
5- మౌలాలి క‌మాన్ రెండు వైపులా 30 అడుగుల వెడ‌ల్పుతో రోడ్డు విస్త‌ర‌ణ‌కు స‌వ‌రించిన ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం.
6- రూ. 4.95 కోట్ల‌తో షేక్‌పేట్‌లో మురుగునీటి మ‌ళ్లింపు, సాహ‌తం చెరువు అభివృద్ది ప‌నుల‌కు ఆమోదం.
7- జాతీయ నిర్మాణ సంస్థ నుండి టౌన్‌ప్లానింగ్ విభాగానికి వంద మంది సివిల్ ఇంజ‌నీరింగ్ గ్రాడ్యుయెట్ సేవ‌ల‌ను మ‌రో సంవ‌త్స‌ర కాలానికి వినియోగించుకునేందుకు ఔట్‌సోర్సింగ్ సేవ‌ల‌కై క‌మిటి ఆమోదం.
8- వార్డు 11 బాలాజిన‌గ‌ర్ డివిజ‌న్ మూసాపేట స‌ర్కిల్ 23లో పిపిపి ప‌ద్ద‌తిలో పార్కు అభివృద్దికి ఆమోదం.
9- కాప్రా ఊర చెరువు అలుగు ప‌క్క నుండి మురుగునీటి మళ్లింపు పైప్‌లైన్ నిర్మాణానికి ఆమోదం.
10- జిహెచ్ఎంసిలోని ఔట్‌సోర్సింగ్ వ‌ర్క‌ర్లు, ఆప‌రేట‌ర్ల ఇ.పి.ఎఫ్‌, ఇఎస్ఐ రికార్డుల నిర్వ‌హ‌ణ‌కు బిడ్డింగ్‌ల‌ను పిలిచేందుకు ఆమోదం.
11- జీడిమెట్ల, ఫ‌తుల్లాగూడ‌ల‌లోని సి అండ్ డి వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ ప్లాంట్ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌స్తుతం ఉన్న రూ. 3కోట్ల నుండి రూ. 6కోట్ల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రానికి ప్లాంట్‌కు మంజూరు చేసేందుకై ఆమోదం.

- Advertisement -