శ్రీరాం సాగర్‌ గేట్లు ఎత్తివేత..

1070
sriramsagar project
- Advertisement -

నిజామాబాద్ శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు అధికారులు. భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరుకుంటుండటంతో 8 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్ని అధికారులు ఎత్తివేశారు.

ఇకమరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ,ఏపీలో ఈ నెల 24 వరకు భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

- Advertisement -