మొక్కలు నాటిన వైశ్య ఫెడరేషన్ ప్రెసిడెంట్..

502
srinivas gupta
- Advertisement -

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ విబాగ్ ప్రెసిడెంట్ ఉటుకూరి శ్రీనివాస్ గుప్త, ఉప్పల శ్రీనివాస్ గుప్త ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో గంజి రాజమౌళి గుప్త చైర్మన్ వాసవి హాస్పిటల్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ కార్యవర్గం మరియు ఆర్య వైశులు బంజారాహిల్స్, లంగర్‌హౌస్, బోరబండ మరియు వివిధ రంగాల వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మరి కొంతమందికి ఈ ఛాలెంజ్‌ను విసిరారు.

harithaharam

ఇందులో రామ సత్యనారాయణ ఫిల్మ్ ప్రొడ్యూసర్, ట్రేసరర్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్, మదిపడిగ్ రాజు వాసవి బిజినెస్ గ్రూప్ ఫౌండర్, ముస్త్యల శ్రీనివాస్ ఐవీఎఫ్‌ హైద్రాబాద్‌ జనరల్‌ ఎస్‌ఈసీ , జెగిని లక్ష్మణ బిల్డర్ లకు గ్రీన్ ఛాలెంజ్‌ను విషిరారు.

అనంతరం శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ మానస పుత్రిక అయిన తెలంగాణకు హరిత హరం స్ఫూర్తితో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ సమతల్యత జరగాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఉద్దేశ్యం మహా గొప్పదని.. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఒక మంచి కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై మోసుకుని తీసుకువచ్చిన ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -