శ్రీనగర్ నిట్ నుండి జమ్మూ కు బస్సులో బయలుదేరిన విద్యార్థులు..

365
nit Students
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్‌ నిట్‌లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విద్యార్దులు తమ సమస్యలను కేటీఆర్ కు ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు.

దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్‌ ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌ వేదాంతం గిరికి విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాసేపటి క్రితమే విద్యార్దులను శ్రీనగర్ నిట్ నుండి జమ్మూకు ప్రత్యేక బస్సులో తరలించారు. శ్రీనగర్‌లోని నిట్‌లో 130 మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. ఈసందర్భంగా కేటీఆర్ కు కృతజ్నతలు తెలిపారు విద్యార్దులు.

- Advertisement -