మహేష్‌ కోసం విలేజ్‌ సెట్‌ చేస్తున్నారు..!

245
Maharshi
- Advertisement -

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు తన 25వ సినిమాగా ‘మహర్షి’ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూఎస్‌లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను యూఎస్‌లో చిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేయనున్నారు.

Maharshi

దీనికి సంబంధించిన ఒక విలేజ్‌ సెట్‌ను వేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు ఫిలింనగర్ వర్గాలు సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ సునిల్ బాబు ఈ విలేజ్‌ సెట్‌ను కండ్లకు కట్టినట్లు కనిపించేలా డిజైన్ చేస్తున్నాడట. భారీ ఖర్చుతో వేస్తున్న ఈ సెట్‌ను ‘మహర్షి’ టీమ్ విదేశాల నుంచి తిరిగి వచ్చేలోగా పూర్తి చేస్తారట. ఆ తర్వాత హీరో హీరోయిన్‌ ఇంకా ఇతర నటీనటుల కాంబినేషన్లో ఈ సెట్‌లో షూటింగ్‌ జరుపనున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -