ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

275
Andhra Pradesh Assembly
- Advertisement -

ఈనెల 20వ తేదిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. రాజధాని అంశంపై ఆరోజున సభలో ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. జీఎన్ రావు, బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ కమిటీ నివేదికలపై చర్చిస్తున్న హైపవర్ కమిటి ఆలోపే నివేదిక ఇస్తుంది. అలాగే ఈ నెల 18న కేబినెట్‌ భేటీ అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తుంది.

ఏపికి మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ సభలో వివరించనున్నారని సమాచారం. విశాఖను పరిపాలన రాజధాని చేయడంతో పాటు రాష్ట్రంలో మొత్తం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు బస్సు యాత్రను చేపట్టారు.

- Advertisement -