స్పీకర్‌ పోచారంను కలిసిన ట్రైనీ ఐఏస్‌లు..

365
speaker pocharam
- Advertisement -

ఈరోజు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని శిక్షణ పొందుతున్న  IASలు కలిశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన శిక్షణ IASలు తమ ట్రైనింగ్‌లో బాగంగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలను పరిశీలించీ అనంతరం స్పీకర్ పోచారంని కలిసారు.

ఈ సందర్భంగా శిక్షణ IAS లకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.. పేద ప్రజలకు సేవ చెసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు రెండు కళ్ళు అన్నారు స్పీకర్ పోచారం.

- Advertisement -