తీహార్ జైలుకు వెళ్లిన మాజీ ప్రధాని, సోనియా

354
manmohan-singh-sonia-gandhi
- Advertisement -

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటూ, తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను కలిశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఉదయం తీహార్ జైలుకు వచ్చిన వీరు, లోనికి వెళ్లి చిదంబరంతో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

త్వరలోనే బయటకు వస్తారని చిదంబరంకు చెప్పినట్లు తెలుస్తుంది. సోనియా, మన్మోహన్ సింగ్ ల రాకతో తీహార్ జైలు వద్ద సందడి నెలకొనగా, పోలీసులు అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మన్మోహన్ , సోనియా రాకతో కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు చిందంబరం కుటుంబ సభ్యులు కూడా తీహార్ జైలుకు వెళ్లారు.

- Advertisement -