కోహ్లీ రికార్డు బ్రేక్‌ చేసిన స్మృతి..!

560
Smriti Mandhana
- Advertisement -

టీం ఇండియా మహిళ జట్టు ఓపెనర్ స్మృతి మందాన్న మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 63 బంతుల్లో 74 పరుగులు సాధించిన స్మృతి అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. దీంతో క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన మూడో క్రికెటర్‌గా స్మృతీ తన పేరును లిఖించుకుంది.

smriti

శిఖర్ ధావన్(48 ఇన్నింగ్స్‌లో) తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రెండో ఇండియన్ క్రికెటర్‌గా కూడా స్మృతీ(51 ఇన్నింగ్స్‌లో) నిలిచింది. కాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్(45ఇన్నింగ్స్)లో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ కంటే కూడా మంధాన ఈ రికార్డును సాధించడం విశేషం. 53వ ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ రికార్డును పూర్తి చేశాడు.

- Advertisement -