గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన సింగర్ మంగ్లీ

543
Mangli
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు మూడు మొక్కలు నాటారు సింగర్ మంగ్లీ. మణికొండలోని Ghmc పార్క్ లో మూడు మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు. 1) సుడిగాలి సుధీర్ 2)యాంకర్ శ్రీముఖి 3)జార్జి రెడ్డి సినిమా హీరో సందీప్ మాధవ్ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

mangli

ఈసందర్భంగా మంగ్లీ మాట్లాడుతూ.. ఒకప్పుడు మన పూర్వీకులు ఎండాకాలం వచ్చిందంటే చెట్లకింద కూర్చుని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించే వారని కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో చెట్లు అంతరించిపోతున్నాయని దాని వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా భూమండలం వేడెక్కుతోంది అన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ అన్న కు వచ్చిన ఆలోచన చాలా గొప్పదని అన్నారు. సంతోష్ అన్న ఆలోచనకు నేను సెల్యూట్ తెలుపుతున్నానని అన్నారు. ఈసందర్భంగా ఎంపీ సంతోష్‌ కు కృతజ్నతలు తెలిపారు.

- Advertisement -