సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ…

289
harish rao
- Advertisement -

సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట..శుద్దిపేటగా మారుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్ 40 సంవత్సరాల సిద్దిపేట జిల్లా కలను నెరవేర్చింది కేసీఆరే అని స్పష్టం చేశారు.

ఆరు నెలల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేస్తామని…తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవ చేసి రుణం తీర్చుకుంటానని తెలిపారు. సిద్దిపేటలో తెలంగాణకే తలమానికంగా అధునాతన దోభిఘాట్‌ను నిర్మించుకున్నామని చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు వైద్య సదుపాయం అందుతోందన్నారు. నాది సిద్దిపేట అని చెప్పుకునే విధంగా ఈ జిల్లాను తయారు చేస్తానని చెప్పారు హరీష్.

రానున్న ఎన్నికల్లో లక్ష మెజార్టీ అందించి దీవించాలన్నారు హరీష్.మీ కష్టాల్లో, సుఖాల్లో ఒక కుటుంబ సభ్యునిగా అందుబాటులో ఉంటానని తెలిపారు. సిద్దిపేట రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఓటుతో మహాకూటమి నేతలకు గుణపాఠం చెప్పాలన్నారు.

- Advertisement -