విద్యావంతులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందిః సిద్దిపేట జిల్లా కలెక్టర్

301
Siidipet Collector Venkat ra Reddy
- Advertisement -

తెలంగాణలో ప్రభుత్వం విద్యావంతులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని చెప్పారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి, జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ. సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామ శివారులో మహాత్మజ్యోతి బాపూలే గురుకుల బాలికల విద్యాలయం ను ప్రారంభించారు కలెక్టర్.

ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 119 పాఠశాలలు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలోని బీసీ పాఠశాలల్లో మొత్తం 86వేల విద్యార్ధులు చదువుతున్నారని చెప్పారు. ఒక్కొ విద్యార్ధికి ప్రతి నెల సగటున 1200రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. నా చిన్నతనంలో హాస్టల్లలో అత్యంత దుర్భర పరిస్ధితిని ఎదుర్కున్నామని చెప్పారు. ఒక్కొ పాఠశాలలో 240మంది విద్యార్దులకు అవకాశం ఉందన్నారు.

- Advertisement -