గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన నటి జయసుధ

704
Jayasuda
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ రూపొందించిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన వారి సంఖ్య మూడు కోట్లు దాటి ముందుకు పోతున్నది. గ్రీన్‌ ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను నటి, మాజీ ఎమ్మెల్యే జయసుద స్వీకరించారు.

Jayasuda 2

ఈరోజు ఆమె కోలేటి దామోదర్ సమక్షంలో తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను మరో ముగ్గురికి విసిరారు. అందులో మోహన్ బాబు, మురళి మోహన్, యాంకర్ సుమలు ఉన్నారు. వీరు ముగ్గురు మొక్కలు నాటి ఒక్కొక్కరు మరో ముగ్గురికి సవాల్ విసరాల్సిందిగా కోరారు.

ఈసందర్భంగా దాయోదర్ గుప్తా మాట్లాడుతూ.. ఖనిజ సంపద, జల సంపద దేశాభ్యుదయానికి ఎంత అవసరమో, వన్య సంపద కూడా అంతే అవసరం అన్నారు. ఈవిషయాన్ని ఎంతో దూరదృష్టితో గ్రహించిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడానికి హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తను విసిరిన సవాల్ నటి జయసుధ స్వీకరించి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -