బ్యాంకు వినియోగదారులకు షాక్‌..

454
- Advertisement -

భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) ఖాతాదారులకు ఇది షాకింగ్‌ న్యూస్‌. అక్టోబరు 1వ తేదీ నుంచి నగదు లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం.. ఇకపై నెలకు మూడుసార్లు మాత్రమే నగదును ఉచితంగా జమచేసే అవకాశం ఉంటుంది. ఆపై ప్రతీ లావాదేవీకి కొంత రుసుము చెల్లించుకోవాలి. మూడుసార్లు తర్వాత చేసే ప్రతీ లావాదేవీకి రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి మళ్లీ జీఎస్టీ అదనం. చెక్‌బౌన్స్ అయితే రూ.150లు ప్లస్ జీఎస్టీని వసూలు చేస్తారు.

sbi

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబైలలో మాత్రం ఇకపై ఉచితంగా 10 ఎస్‌బీఐ ఏటీఎం లావాదేవీలను అందించనుంది. ఇతర నగరాల్లో 12 లావాదేవీల వరకు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంక్‌ ఏటీఎంలలో ఐదు లావాదేవీలను ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఎస్‌బీఐలో వేతన ఖాతాలుంటే ఏటీఎం సేవలు పూర్తిగా ఉచితం. బ్యాంకుకు వెళ్లి చేసే ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్టీజీఎస్ సేవలకు రూ.20, రూ. 5 లక్షలు దాటితే రూ.40లు వసూలు చేస్తారు. దీనికి చార్జీలు అదనం. అయితే, ఇవే సేవలను నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాకింగ్, లేదంటే ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా మాత్రం పూర్తి ఉచితంగా చేసుకోవచ్చు..

- Advertisement -