జనవరి 12న “సరిలేరు నీకెవ్వరు”

472
Sarileru nievaru
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరుస‌. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలోసీనియర్‌హీరోయిన్‌విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ – “ఈ సంక్రాంతి పండుగ నాకు బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ స్పెషల్”అన్నారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ దిల్‌రాజు మాట్లాడుతూ – “సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.అన్నారు.

అగ్ర నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ – “జనవరి 12 నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ మీ హృదయాలను జయించి మీలో నవ్వుల్ని పూయిస్తుంది. యాక్షన్‌తో మిళితమైన 100 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్‌ను మేము ప్రామిస్ చేస్తున్నాము” అన్నారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “సరిలేరు నీకెవ్వరు’ చూసి వచ్చే సంక్రాంతికి మీరంతా నవ్వకుండా, చప్పట్లు కొట్టకుండా, ఈలలుతో గోల చేయకుండా ఉండలేరు” అన్నారు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ – “క్యాలెండర్‌లో డేట్ మార్క్ చేసుకోండి. జనవరి 12న థియేటర్స్ లో కలుద్దాం ‘అన్నారు.

- Advertisement -