మొక్కలు నాటిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ..

533
- Advertisement -

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎస్పీ “చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్‌” జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకొని, ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ మహత్తర కార్యక్రమం చేపట్టిన జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు.

Sangareddy SP Accepts Green Challengeఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా ముగ్గురు పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ చేసిన వారిలో 1) మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి, 2) సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, 3) డీటీసీ ప్రిన్సిపాల్ సీతారాం ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఐ హరిలాల్, ఆర్‌ఎస్ఐలు రాజశేఖర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గా రెడ్డి, కోశాధికారి ఆసిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -