కాంగ్రెస్‌లో లాబీయిస్టులకే పదవులుః ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

210
Jagga Redddy
- Advertisement -

సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కాంగ్రెస్ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వీహెచ్ త‌ప్ప ఎవ‌రూ ప‌రామ‌ర్శించ‌లేద‌న్నారు. ఈవిష‌యం నన్ను చాలా భాదించిందన్నారు. తనకు, సిఎం కెసిఆర్‌కు ఎలాంటి విభేదాలు లేవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం కెసిఆర్, కెటిఆర్‌లను కలుస్తానన్నారు. సీఎం కేసీఆర్ వ‌ల్లే తాను మొద‌టిసారి ఎమ్మెల్యేగా గెలిచాన‌న్నారు.

mla Jaggareddy

కాంగ్రెస్‌లో లాబీయిస్టులదే హవా నడుస్తోందని, లాబీయిస్టులకే కాంగ్రెస్ పార్టీ పదవులు కట్టబెడుతోందని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఇబ్బంది పడుతున్న నేతలకు రాహుల్ గాంధీ భరోసా ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న 75 శాతం మంది నేతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. తాను ఎట్టి ప‌రిస్ధితుల్లో కాంగ్రెస్ పార్టీని విడ‌బోన‌ని తేల్చిచెప్పారు. సీనియ‌ర్ నాయకులు ఎంపీ బ‌రిలో ఉంటే 6 నుంచి 7నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవ‌కాశం ఉంద‌న్నారు ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.

- Advertisement -