మేనేజర్‌పై ఆగ్రహించిన సమంత..?

267
Samantha Angry on Managers Mahendra?
- Advertisement -

అక్కినేని వారి ఇంట్లో ప్రస్తుతం సమంత సక్సెస్ ఫుల్ స్టార్ గా ఎదిగిపోతోంది. ఈ ఏడాది ప్ర‌థ‌మార్దంలో వ‌రుస సినిమాల‌తో బిజీ అయిన స‌మంత మంచి హిట్స్ సాధించింది. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా గడుపుతుంది సామ్‌. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాల యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా సమంత చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Samantha Akkineni

ఇక అసలు విషయం ఏంటంటే.. తనను పిలవకుండా, తనకు చెప్పకుండా తన మేనేజర్ మహేంద్ర, దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ లు హ్యాపీగా పార్టీ చేసుకోవడంపై చిలిపిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల విడుదలైన ‘చిలసౌ’, ‘గూఢచారి’ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ రెండు సినిమాల్లో నటించిన వెన్నెల కిశోర్, మహేంద్ర, రాహుల్ లు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు.

అయితే అందుకు సంబంధించిన ఫొటోలను మహేంద్ర తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. ఈ చిత్రాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని, అడవి శేషు, రాహుల్ రవీంద్రన్ కోసం వెయిట్ చేస్తున్నానని మహేంద్ర ట్వీట్ చేయగా, సమంత వాటిని చూసింది. “ఈ ట్వీట్‌ ను ఎవరు టైప్‌ చేశారు.. ముందు అది చెప్పు” అని సమంత వెంటనే స్పందించింది. ఈ పార్టీకి తనను ఎందుకు పిలవలేదన్న చిరుకోపాన్ని సమంత ఈ ట్వీట్ ద్వారా చూపింది.

- Advertisement -