బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ మోషన్ పోస్టర్ రిలీజ్

201
srivasu-pooja
- Advertisement -

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘సాక్ష్యం’ టైటిల్‌ని ఖరారు చేశారు. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను పాత్రికేయులు విడుదల చేశారు.

srivasu-pooja

‘పంచభూతరహిత గాత్రమిదే..పంచభూత కృత క్షేత్రమిదే’ అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇప్పటికే లక్ష్యం, లౌక్యం వంటి చిత్రాలతో సక్సెస్ సాధించిన శ్రీ వాస్… బెల్లంకొండ కొత్త చిత్రానికి ‘సాక్ష్యం’ అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఈ మూవీలో అలనాటి అందాల తార మీన హీరోకు తల్లిగా నటిస్తుండగా.. జగపతిబాబు, శరత్‌కుమార్, మీన, వెన్నెలకిశోర్, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -