విదేశాల్లో సాహో జంట ఆటా పాట..!

674
Prabhas
- Advertisement -

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా భారీ జడ్జెట్‌లో రూపొందిస్తున్న చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం పాటల చిత్రీకరణ పనిలో వుంది. పాటల చిత్రీకరణ కోసం ఈ సినిమా టీమ్ ఇటీవల ఆస్ట్రియా వెళ్లింది. ఆ దేశంలోని ఆల్ప్స్ పర్వతాల్లో ప్రభాస్ – శ్రద్ధా కపూర్ లపై ఒక డ్యూయెట్ ను చిత్రీకరిస్తున్నారు.

మంచు పర్వతాల్లో చిత్రీకరిస్తోన్న ఈ రొమాంటిక్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడిగా నటిస్తోన్నాడు. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక రీసెంట్‌గా `సాహో` టీజ‌ర్ విడుద‌లైంది. ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో ఉన్న ప్ర‌భాస్‌ను ఈ టీజ‌ర్‌లో చూపించారు. హాలీవుడ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ త‌ర‌హాలో ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని ఈ టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ మూవీని ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

- Advertisement -