200 కోట్లతో దూసుకుపోతున్న ‘సాహో’..!

407
saaho
- Advertisement -

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబడుతూ కొత్త రికార్డులు సృష్టించింది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు. మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘సాహో’, రెండో రోజు కూడా అదే రీతిలో కలెక్షన్ల వర్షం కురిపించింది.

Saaho

మొత్తమ్మీద రెండ్రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అధిగమించింది. ఈ మేరకు ‘సాహో’ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. రెండు రోజుల్లో తమ చిత్రం వరల్డ్ వైడ్ రూ.205 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని యూవీ క్రియేషన్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

- Advertisement -