ఉదయం నుంచే విధుల్లోకి ఆర్టీసీ కార్మికులు

505
rtc employees
- Advertisement -

సీఎం కేసీఆర్ పిలుపుతో ఉదయం నుంచే వివిధ జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున విధుల్లోకి చేరుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని సీఎం ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు ప్రభుత్వాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నామని చెబుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఆరు డిపోల వద్ద ఉదయం 3.30 గంటల నుంచి ఇప్పటివరుకు దాదాపు 15 మంది కండక్టర్‌లు,డ్రైవర్లు విధుల్లోకి చేరారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు 5 గంటల నుంచే డ్రైవర్లు,కండక్టర్లు తొలి షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 2600 మంది విధులకు హాజరుకానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది డిపోల పరిధిలో 3,800 మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్ కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

cm kcr appeal Telangana RTC Workers Join To Duty ….cm kcr appeal Telangana RTC Workers Join To Duty

- Advertisement -